October 20, 2016

తల్లి భూదేవి - మట్టి మనుషుల జీవితమూ, యుద్ధమూ

ఎన్నో పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని పుస్తకాలు, అందులో కొన్ని పాత్రలు మాత్రం జీవితాంతం వెంటాడుతూంటాయి. అలాటి పుస్తకాలలో ʹతల్లి భూదేవిʹ (Mother Earth) ఒకటి. అలా వెంటాడే పాత్రల్లో తొల్గొనాయ్, అలిమన్ లు.

డెబ్భైల్లో, ఎనభైల్లో విప్లవోద్యమాల్లోకి, వామపక్ష ఉద్యమాల్లోకి వచ్చినవాళ్లు ఈ పుస్తకం చదవకుండా రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విప్లసాహిత్య శిబిరాల్లో మొట్టమొదట చదవాల్సిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. ఒకసారి ఈ పుస్తకం చదివితే ఇందులోని పాత్రలు, తొల్గొనాయ్, అలిమన్, మనకు ఆప్తులు అయిపోతారు. మన నిజ జీవితాల్లో అలాటివాళ్ళు మనకి ఎక్కడో ఓ సారి మనకి తారసపడే వుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ బాధలు, జీవితమ్మీద, మనుషులమీద ప్రేమతో వాళ్ళు మాట్లాడే మాటలు, సత్యం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు -- మరెప్పటికీ మనమీద చెరగని ముద్ర వేస్తాయి.
చింగీజ్ ఐత్ మాతొవ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లోని కిర్గిజ్ ప్రాతానికి చెందిన గొప్ప రచయిత. రష్యన్ విప్లవం విజయవంతమైన తర్వాత పుట్టిన తరానికి చెందిన వాడు. తన ముందరి తరాల రచయితలు, విప్లవానికి, రష్యన్ సమాజానికి దారిచూపించిన మహా రచయితలైన చెహోవ్, గోర్కీ, టాల్ స్టాయ్, మైకోవిస్కి వంటి గొప్ప రచయితల వారసత్వాన్ని కొనసాగించినవాడు..........
The Link to the Original article.
http://virasam.in/article.php?page=283

October 05, 2016

ఈ పుస్తకం చదివేరా?

http://virasam.in/article.php?page=269

కొందరి రచయితలు రాసిన కొన్ని పుస్తకాలు మహా గ్రంథాలుగా నిలిచిపోతాయి. శ్రీ శ్రీ అనగానే మహాప్రస్థానం, పతంజలి అనగానే వీరబొబ్బిలి, రాజయ్య అనగానే కొలిమంటుకున్నది, జాషువ అనగానే గబ్బిలం, కారా అనగానే యజ్ఞం మనకు గుర్తొస్తాయి. ఈ గుర్తుకురావడం ఎంతవరకూ పోయిందంటే వాళ్ళు రాసిన ఇతర రచనలేవీ రచనలుగా పరిగణించనంతగా. 
దీనివల్ల నష్టం మనకే గానీ వాళ్లకి కాదు. ఒక్క పుస్తకం చదవకుండా వదిలేసామంటే ఒక గొప్ప అనుభవాన్ని వదిలేసుకుంటున్నట్టే. ముఖ్యంగా రచయితలు squander చేసుకుంటున్నది అంతాఇంతా కాదు........

October 02, 2016

జలగలు

నెలమొత్తం కష్టపడి టైమూ, డబ్బులూ చూసుకుని ఒక్క సినిమా చూద్దామని వెళ్తామా, అదే మన నెత్తిన భస్మాసుర హస్తమవుతుంది. 

రాత్రి తెర కనిపించిన వాళ్ళు పొద్దున్నకల్లా టీవీల్లోకి, హోర్డింగుల మీదికి, పత్రికల్లోకి, ఫేస్బుక్కుల్లోకి, ట్విట్టర్లలోకి ప్రత్యక్షమవుతారు. 

అది కొని దాహం తీర్చుకో, ఈ బట్టలు కొనుక్కో, ఆ టీవీ కొను, ఆ షాపులో బంగారం కొను, ఇక్కడ తాకట్టు పెట్టు, ఫలానా చోట ఇల్లు కొను, ఫలానా పార్టీ వాడికి ఓటెయ్యి, ఈ పౌడరు కొను, ఆ సబ్బు కొను, ఈ నూడుల్స్ తిని చూడు, ఆ లాగు కొనుక్కో, తలకి ఆ కంపెనీ వాడి రంగేసుకో -- అని వెంటాడుతుంటారు. 
వాళ్ళు బహుశ పక్కపక్క ఇళ్లల్లోనే వుంటారు. తరుగు భారం లేని బంగారం కొనమంటాడొకడుడు. తర్వాత తాకట్టుపెట్టమంటాడొకడు. పాత సామాన్లు అమ్మేసి తాజా సామాన్లు కొనుక్కోమంటాడొకడు. ఒకషాపులో బంగారం కొనమని తండ్రి చెప్తాడు, పక్క షాపులో సూట్లు కొనుక్కోమని  కొడుకు చెప్తాడు. అదే షాపులో పట్టుచీరలు కొనుక్కోమని కాబోయే కోడలు చెప్తుంది.
ఇంకొకడు రమ్మీ ఆడమంటాడు, ఇదిగో కొంచెం బోనస్ ఇస్తున్నా ఆడి చూడు మజా వస్తుందంటాడు. ఇంకొకడు చల్ల చల్లటి నూనె కొనుక్కోమంటాడు. మరొకడు మరొకటి అంటాడు.
కొందరు వస్తువులకీ, మరికొందరు పార్టీలకీ ప్రచారం  చేస్తారు. ఆ మురిపాలు చూసి, ఆ హొయలు చూసి, ఆ తొడగట్టే ఆవేశాలు చూసి -- ఇల్లూ, వళ్ళూ పాడు చేసుకుని దివాళా తీసి కుదేలై ఉంటాం మనం. వాళ్లు మాత్రం ఎప్పుడూ తళ తళా మెరుస్తుంటారు. ఎగిరే జుత్తు చూసి, వస్తువుల కోసం వాళ్ళు వడుపుగా చేసే విన్యాసాల గురించి మనం అచ్చెరువొందుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ ఒక్క గాడిద కూడా ఈ నెలంతా వర్షాలు పడ్డాయి, వరదలొచ్చాయి ఏం తిని బతుకుతున్నారు? దిక్కుమాలిన రోడ్లమీదపడి రోజులు ఎలా వెళ్లదీస్తున్నారు? రోజులు గడుస్తున్నాయా? డెంగీ జబ్బుల బారిన పడి మీ పిల్లలు ఎలా లుగుతున్నారు,  అని అడగరు. తొడలుగొట్టరు, గర్జించరు. జాబులు ఇస్తామన్న వారు జాబులు ఇచ్చారా అని అడగరు. 

కానీ, కోకులు తాగండి, నూనెలు వాడండి, నూడుల్స్ తినండి, బంగారం కొనండి, ఆ నాయకుడికి ఓటెయ్యండి  అంటూ వాళ్ళు చేసే ప్రచారం ఆగదు.
మన జేబుల్లో డబ్బులన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతాయి. మన మీద పెత్తనమంతా వాళ్ళు ప్రచారం చేసిన వస్తువలకి, నాయకులకి వెళ్ళిపోతుంది.
దుర్భరమైన ఈ జీవితం నుంచి కొంచెం సాంత్వన కోసం ఓరోజు సాయంత్రం సినిమాకి వెళ్తాం. 
 

September 28, 2016

Change the way you make films: Goutam Ghose

Dalits and Adivasis live in very bad conditions. their lives are not shown. We need to take care of them. It is very important for us lend voice to their issues.
Though development is important, it is equally crucial to ensure it is constructive. “If development results in displacements, it would lead to conflicts. You need to balance the act in order to avoid conflicts and ensure peace,” Goutam Ghose observes.
Change the way you make films: Goutam Ghose: ‘Smartphones pose challenges to film-making’

September 11, 2016

హోదా రొద

ఒక ప్రజడు (కాంగ్రెస్ తో): అప్పుడు హోదా ని చట్టంలో ఎందుకు పెట్టలేదు?
కాంగ్రెస్: అప్పుడు మాకు హోదా వుంది కాబట్టి అలా నమ్మించేం. 

ఒక ప్రజడు(బీజేపీతో): 'హోదా మించిన పేకేజీ' గురించి అప్పుడు అడగకుండా హోదా ఎందుకు అడిగేరు?
బీజేపీ: అప్పుడు మాకు హోదాలేదు. మా హోదా కోసం అలా అనీసేం. 

ఒక ప్రజడు (టీడీపీతో): అప్పుడు హోదా ఇప్పిస్తామన్నారు, పదేళ్లు, పదిహేనేళ్ళుండాలన్నారు. ఇప్పుడు పేకేజీ అంటున్నారు?  
టీడీపీ: మాకు హోదా కావాలని మీకు హోదా కావాలన్నాం. మాకు హోదా వచ్చింది కాబట్టి మీకు కేబేజీ చాలు. 

ఒక ప్రజడు (వైఎస్సార్సీ తో): మీరు హోదా గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పిస్తారా?
వైఎస్సార్సీ: మాకు హోదా వచ్చేవరకూ అడుగుతాం. 

ఒక ప్రజడు (జనసేనతో): హోదా కి హామీ అన్నారప్పుడు?
జనసేన: ఇప్పటికీ అంతే, ఎప్పటికీ హామీ ఉంటాం. ఉంటాం. ఉంటాం. అ( అ( అ(

ఒక ప్రజడు (రామోజీ, రాధాక్రిష్ణతో): అప్పుడు హోదా గొప్పదన్నారు. ఇప్పుడు పేకేజీ గొప్పదంటున్నారు?
రామోజీ, రాధాక్రిష్ణ: అప్పుడు 'హోదా' అంటే, ఇప్పుడు పేకేజీ అంటే మా బాబుకి ఇష్టం.  

కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీ, జనసేన, రామోజీ, రాధాక్రిష్ణ  (ప్రజడులతో): హోదా అయితే ఏంటి, పేకేజీ అయితే ఏంటి? ఏదైనా మాకే. చప్పుడు చెయ్యక పనిచూసుకో.   

         

August 26, 2016

అది హృదయమ్ము సుమ్మీ!

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?
అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.
***
ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.
***
ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!
ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.
అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.
ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.
అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పాడాల్సిందే.
రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.
ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు కాదు.  
తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.
దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.
అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.
ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.
అది హృదయమ్ము సుమ్మీ!
(Original link to the saaranga post: http://magazine.saarangabooks.com/2016/08/24/%E0%B0%B9%E0%B1%83%E0%B0%A6%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81-%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80/ )

July 23, 2016

కబాలి మనకి నచ్చదు

రజనీకాంత్ ఈ సినిమాలో సూర్యుడిని చేత్తో ఎగరేసి, కాలితో తన్ని విసిరెయ్యలేదు.
మూడు పిల్లిమొగ్గలేసి ఎగిరే విమానం మీద కూచోలేదు. అణుబాంబుని ఆరు ముక్కలు చేసి ఆర్గురు విలన్ల నోళ్ళలో వి సిరెయ్యలేదు.
ప్రపంచంలోని దుర్మార్గుల్ని, దెయ్యాలని అన్నిటినీ ఓడించెయ్యలేదు. 
ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు అని ఓ రౌడీ చెప్పినట్టు కాక, "ఎగిరే పక్షుల్ని ఎగరనీయాలి. మీ దయతో పంజరంలో పెట్టి చంపెయ్యకండి" అని చెప్తే ఎలా నచ్చుతుంది? పాతికేళ్ళు జైల్లో మగ్గినవాడికి తెలుస్తుంది వెలుగు విలువ. అందుకే కసిగా తీస్తాడు ఓ పంజరం తలుపుని, ఓ పక్షికి ప్రపంచాన్ని ఇస్తాడు.
రజనీకాంత్  మామూలు మనిషిలా గర్భంలోనే సమాధై పోయిందనుకుంటున్న బిడ్డ బతికి ఉండి ఉంటుందా అని వ్యాకులపడితే, ఎవరో పాప కళ్ళల్లో బిడ్డని చూసుకుంటే మనం ఎలా చూడగలం? 

ప్రాణంలో ప్రాణంలాటి భార్య బతికుందో లేదో, భార్య బతికే ఉందని తెలిసేక కలుసుకోవాలని ఉద్వేగపడితే ఎలా భరిస్తాం? భరించలేం.
భార్య బతికేవుందని తెలిసేక చెప్పనలవికాని ఆనందంతో మామూలు మనిషిలాగ, మనలాగ కూలబడితే, మనకి ఎలా నచ్చుతుంది? నచ్చనే నచ్చదు. 
చేతిలో టేబ్, అందులో ఫేస్ బుక్ కాకుండా చీప్ గా మై ఫాదర్ బాలయ్య బుక్ పట్టుకున్నాడు.
ఏదో స్టైలిష్ గా సూట్ వేసుకోకుండా, ఓ ఇరవై సార్లు ఎందుకేసుకోవాలో అంబేద్కర్ ని కోట్ చేసి మరీ చెప్పేడు.
మనకి నచ్చదు కాక నచ్చదు.

June 26, 2016

Bumping into an unknown musician




ఈరోజు వాకింగ్ కి అస్సలు వెళ్ళ బుద్ధి కాలేదు. బద్ధకం, self-pity. ఎంత లేటైనా సరే వెళ్లి తీరాల్సిందేనని 'లోపలి వాడిని' గద్దించి బయల్దేరాను.
వెళ్లడం ఎంత మంచిదైందో ఒక రౌండ్ పూర్తయ్యాక తెలిసింది.
చల్లటిగాలితో కలిసిపోయిన పాట పార్కును హత్తుకుంది. 
'మేరే సాప్నోంకి రాణి కబ్ ఆయేగీ తు
ఆయి రుత్ మస్తానీ క్యాబ్ ఆయేగీ తు ...'
పాట నన్నక్కడే ఆపేసింది. పక్కనే ఆటో ట్యూన్స్ ని పెట్టుకుని, కిషోర్ గొంతును గొప్ప పారవశ్యంతో మౌత్ ఆర్గాన్ తో అనువాదం చేస్తున్నాడు, ఓ మూల బెంచి మీద కూచుని. ఆటో ట్యూన్స్ ప్లేయర్, వాటర్ బాటిల్, ఇంకా ఓ నాలుగైదు మౌత్ ఆర్గాన్లు వున్నాయి.
వాకింగ్ చేస్తున్న వాళ్లు, ఆడుకుంటున్న పిల్లలు, ఇంకా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు -- అసలు వాళ్ళక్కడ వున్నరారన్న ధ్యాసే లేదు ఆయనకు.
ఊపిరితిత్తుల శక్తి మొత్తం కూడదీసి, పాట మీది, సాహిత్యం మీది, సంగీతం మీది గొప్ప ప్రేమను ప్రకటిస్తూ మౌత్ ఆర్గాన్ ను ఊదుతున్నాడు. ట్యూన్ కి తగ్గట్టూ ఊగిపోతున్నాడు. ఒకచేత్తో మౌత్ ఆర్గాన్ ని అటూ ఇటూ వేగంతో తిప్పుతూ, రెండో చేత్తో ట్యూన్ కి తగ్గ గాలిని అందిస్తున్నాడు. గాలి వాటాన్ని వాడుకుని నావని నడుపుతున్న పడవవాడి వడుపు కనిపిస్తుంది అతని చేతిలో.
ఒకదాని వెంట ఒకటి, మధ్యలో పెన్ డ్రైవ్ లోని ట్యూన్లను వెతుక్కుంటూ, నోట్ బుక్ లోని లిరిక్స్ ని చూస్తుకుంటూ వాయిస్తూనే వున్నారు, అలుపెరగకుండా. 
అతడు డిస్టర్బ్ అవుతాడేమోనని కొంచెం దూరం నుంచే విని, పాట అయిపోయాక వెళ్లి మాట్లాడేను. ఆయన పేరు రాజ్ కుమార్. జీ ఎచ్ ఎమ్ సీ లో పనిచేసి రిటైర్ అయ్యారు. హార్మోనికా క్లబ్ సభ్యులు. కనీసం ఓ నలభై ఏళ్లుగా మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తున్నారు.
"ఎంత గొప్ప ట్యూన్," అన్నాను, ఓ ఆర్ డి బర్మన్ పాట అయిపోయాక.
ఇక తాదాత్మ్యంతో చెప్తున్నాడు, ఆయన ఎంత గొప్ప కంపోజరో. "He died too young. Had he lived longer, we would have got scores of tunes more."
పిల్లలకు ప్రతీ ఆదివారం ఉచితంగా నేర్పుతున్నారట, ఇందిరా పార్కులోనే.
ఈరోజు వాకింగ్ కి వెళ్లడం ఎంత మంచిదైందో కదా అనుకున్నాను.
బహుశా, అందుకే ఖలీల్ జిబ్రాన్ అన్నాడు,
"In the dew of little things the heart finds its morning and is refreshed."
How true! My morning was refreshed.







June 21, 2016

యోగాసనాలు వెయ్యండి. వేస్తే....


Source: Artist unknown, from Pinterest
      నల్లడబ్బు ఇండియాకి రాలేదన్న,
      మాల్యా వెనక్కి రాడేమోనన్న,
      ధరలు కిందకి దిగవేమోనన్న, 
      ప్రత్యేక హోదా ఇవ్వరేమోనన్న, 
      ఉద్యోగాలు రావేమోనన్న,
     పొలాలు పోతా ఏమోనన్న, 
     ఆత్మహత్యలు ఆగవేమోనన్న, 
     అత్యాచారాలు ఎంతకాలమిలా అన్న, 
     పన్నులు పెరగడం ఆగదా అన్న,
     ........ 
     తుఛ్ఛమైన సందేహాలు, భయాలు, ఆందోళనలు 
     కలగకుండా హాయిగా వుంటుంది. 

    యోగా చేసేక కూడా మీకు ఈ సందేహాలు, భయాలు,    
    ఆందోళనలు ఉన్నాయంటే అర్ధం మీరు యోగా సరిగా చెయ్యడం     లేదు. లేదా మీరు జాతి వ్యతిరేకులు అయి వుండాలి.  
    మీరు దోచుకోండి, వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపొండి
    లేదా మతం పేరుతో, కులం పేరుతో మనుషుల మధ్య    
    బ్రహ్మచెముడు కంచెలు వెయ్యండి, ఆదివాసుల కాళ్ళ కింద  
    భూమి లాగేసుకుని గనులు తవ్వండి, -- కానీ యోగా చెయ్యండి.  
    మనసు ప్రశాంతంగా వుంటుంది. 
    మీ మనసు ప్రశాంతంగా లేకుండా చేసే వాళ్ళతో యోగా  
    చేయించే పూచీ మాది. యోగా చేయించి వాళ్ళ మనసు
     ప్రశాంతంగా వుండేటట్టు చేస్తాం.

మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు శలభాసనం వేసేలోగా
అన్నిట్లోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చేయాలి.
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు భుజంగాసనం వేసేలోగా
తీరం వెంబడి ఓ నాలుగు అణువిద్యుత్ కేంద్రాలు పెట్టెయ్యాలి
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు కుక్కుటాసనం వేసేలోగా 
మీ భూముల్ని ముంచేసే ప్రాజెక్టుని ఓకే చేసెయ్యాలి 

యోగా బాగా చెయ్యండి, మీకు చాల అవసరం. 
తర్వాత మళ్ళీ చెప్పలేదంటారు
మీ మనసు, ఆరోగ్యం బాగుండాలంటే 
యోగా చాలా అవసరం.

వేశ్యకి వ్యభిచార దోషం ఉండదు
రాజకీయనాయకులకు అవినీతి దోషం, హత్యా దోషం ఉండదు.
శీర్షాసనం వేసేక కూడా మీకు ఈ సంగతి మీకర్ధం కాకపోతే
మీకిక శాశ్వత శవాసనమే.





June 17, 2016

నకిలీ -- బాబాలు, నాయకులు



(ఫోటోలో, లైఫ్ స్టైల్ భవనం యజమాని
 బురిడీ కొట్టి కోటిన్నర కొట్టేసిన నకిలీ బాబా)
"అంత  చదువుకున్న వాడు, డబ్బున్న వాడు అంత అవివేకంగా దొంగ బాబాకి ఎలా లొంగిపోయాడు? అత్యాశ కాకపోతే ఎక్కడైనా డబ్బు వూరికే రెట్టింపు అవుతుందా? ఆమాత్రం  ఆలోచన ఉండొద్దా?," ఇది ఓ మిత్రుడి కామెంట్. 

నేను అన్నా,

నరమేధం చేసినవాడు దేశాన్ని బాగుచేస్తానంటే,
వెన్నుపోటు పొడిచిన వాడు సింగపూర్ ని చేస్తానంటే, 
ద్రోహుల్ని ఆలింగనం చేసుకుంటున్న వాడు
మన బతుకుల్ని బంగారం చేస్తానంటే,
నమ్మ లేదా? నమ్మటం లేదా? 
వాళ్ళనే నమ్ముతాం కానీ,
మన బతుకులు బండ బతుకులుగానే వున్నాయని
ఎండమావుల వెంటే మనల్ని పరిగెత్తిస్తున్నారని
చెప్పేవాళ్ళని  నమ్ముతామా?
నమ్మం కాక నమ్మం 
అంతే,
దోచుకునే బాబాలను నకిలీ బాబాలుగా గుర్తించినట్టు 
దోచుకునే నాయకులను నకిలీ నాయకులుగా గుర్తించం.

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...