ఎన్నో పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని పుస్తకాలు, అందులో కొన్ని పాత్రలు మాత్రం జీవితాంతం వెంటాడుతూంటాయి. అలాటి పుస్తకాలలో ʹతల్లి భూదేవిʹ (Mother Earth) ఒకటి. అలా వెంటాడే పాత్రల్లో తొల్గొనాయ్, అలిమన్ లు.
డెబ్భైల్లో, ఎనభైల్లో విప్లవోద్యమాల్లోకి, వామపక్ష ఉద్యమాల్లోకి వచ్చినవాళ్లు ఈ పుస్తకం చదవకుండా రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విప్లసాహిత్య శిబిరాల్లో మొట్టమొదట చదవాల్సిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. ఒకసారి ఈ పుస్తకం చదివితే ఇందులోని పాత్రలు, తొల్గొనాయ్, అలిమన్, మనకు ఆప్తులు అయిపోతారు. మన నిజ జీవితాల్లో అలాటివాళ్ళు మనకి ఎక్కడో ఓ సారి మనకి తారసపడే వుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ బాధలు, జీవితమ్మీద, మనుషులమీద ప్రేమతో వాళ్ళు మాట్లాడే మాటలు, సత్యం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు -- మరెప్పటికీ మనమీద చెరగని ముద్ర వేస్తాయి.
చింగీజ్ ఐత్ మాతొవ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లోని కిర్గిజ్ ప్రాతానికి చెందిన గొప్ప రచయిత. రష్యన్ విప్లవం విజయవంతమైన తర్వాత పుట్టిన తరానికి చెందిన వాడు. తన ముందరి తరాల రచయితలు, విప్లవానికి, రష్యన్ సమాజానికి దారిచూపించిన మహా రచయితలైన చెహోవ్, గోర్కీ, టాల్ స్టాయ్, మైకోవిస్కి వంటి గొప్ప రచయితల వారసత్వాన్ని కొనసాగించినవాడు..........
The Link to the Original article.
http://virasam.in/article.php?page=283
No comments:
Post a Comment